అధికారులకు స్వీట్స్ పంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అధికారులకు స్వీట్స్ పంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర. వీపనగండ్ల:-కొల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవడంతో చిన్నంబాయి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, కెఎమ్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పేదల ఆశాజోతి  ఎన్నారై కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం పోలీస్ స్టేషన్ లో అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు అందజేశారు. మంత్రిగా జూపల్లి కృష్ణారావు హాయంలో చిన్నంబాయి ని మండల కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడంతో జూపల్లి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాలను మరి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని వారు అన్నారు.కార్యక్రమంలో మండల వాల్మీకి సంఘం అధ్యక్షులు శ్రీ రామకృష్ణ నాయుడు,నాయకులు తిరుపతియ్య, సుధాకర్, గోవిందు తదితరులు ఉన్నారు.