72వ రోజుకు చేరిన నిరుపేదల సంఘం దీక్ష

72వ రోజుకు చేరిన నిరుపేదల సంఘం దీక్ష

నేరేడుచర్ల ముద్ర నేరేడుచర్ల పట్టణంలో  నిరుపేదల సంఘ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్ష మంగళవారానికి 72వ రోజుకు చేరింది. దీక్షలో ప్రజా  గాయకుడు ఎర్రమల శీను పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరేడుచర్లలో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 243,244,250253,358,479,206,226,231, లో గల ప్రభుత్వ భూమి పేదలకు ఇళ్ల స్థలాలు గా కేటాయించాలని డిమాండ్ చేశారు.  కలెక్టర్,తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారని,  నిరుపేదలకు ఇళ్ల స్థలాలు గాని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో నిరుపేదల సంఘం నాయకులు వాసపల్లయ్య సయ్యద్ హుస్సేన్,వాస కరుణాకర్,  నరసమ్మ, దుర్గమ్మ,నసిబాబేగం కతేజ సత్తెమ్మ,మారెమ్మ మరియమ్మ,ఉపేంద్ర,రెడ్డిపల్లి కోటమ్మ,లక్ష్మయ్య, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.