నిరుపేదలకు రగ్గుల పంపిణీ అభినందనీయమం  - రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు

నిరుపేదలకు రగ్గుల పంపిణీ అభినందనీయమం  - రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు
ముద్ర ,రామగిరి మండలం:-  రత్నాపూర్ గ్రామంలో నిరుపేదలకు రగ్గుల పంపిణీ అభినందనీయమని స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు అన్నారు. మంగళవారం సెంటినరీ కాలనికి చెందిన దాతలు ప్రతిభ హోం అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ పాల ప్రవీణ్, సాయి, అరేపల్లి అభిలాష్ లేవి ఆధ్వర్యంలో ఉచితంగా రగ్గుల పంపిణీ చేసారు.ఇప్పటికే మంథని, గోదావరిఖని, పెద్దపల్లి బస్ స్టాండ్ లో, కల్వచేర్ల, పన్నూర్, సెంటినరీ కాలనీ లో ఇప్పటి వరకు 150 రగ్గులను నిరుపేద వృద్ధులకు అందించామని దాతలు తెలిపారు. చలి కాలం కావడంతో వృద్ధులు చలి భారీన పడకుండా ఉండేందుకు రగ్గులు అందించమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ధర్ముల రాజ సంపత్, ఉప సర్పంచ్ దుబ్బాక సత్య రెడ్డి, వార్డ్ మెంబర్ బొంగురాల రవి, వేగోళపు మల్లయ్య గౌడ్, స్థానిక నాయకులు గిరవేన రాములు యాదవ్, భాద్రపు రంగయ్య, తొట్ల సాగర్ యాదవ్ పాల్గొన్నారు.