లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

శంకరపట్నం ముద్ర : శంకరపట్నం మండల పరిధిలోని  తాడికల్  గ్రామ శివారులో ని మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు,లారీ ఎదురుగా ఢీకొన్నాయి. ఆదివారం నాడు వరంగల్ నుండి నిజాంబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు, కరీంనగర్ నుండి హుజూరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.ఎండి హైమద్ అలీ,డ్రైవర్ ఎండి నవాజ్,ఎండి సోహెల్ పాషా,ఆరోగ్యం అనే వ్యక్తులకు తీవ్ర గాయాల పాలైనారు.స్పందించిన స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఈఎంటి  సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేస్తూ కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.