ఎమ్మెల్సీ కవిత ఫోన్లు సీజ్...
ముద్ర,హైదరాబాద్:-బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 2 గంటల నుంచి 10 మంది అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే కవిత స్టేట్మెంట్ను రికార్డు చేసిన ఈడీ.. ఆమె ఫోన్లను సీజ్ చేసింది. మరోవైపు ఆమె న్యాయవాదులు ఇంటికి చేరుకోగా.. వారిని ఇంట్లోకి రానివ్వకుండా అధికారులు బయటే ఆపేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక BRS శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.