అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
  • మేడ్చల్ ఇన్ ఛార్జ తోటకూర వజ్రేష్ యాదవ్

ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్క పేదింటి బిడ్డకు అందించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వ బలమని, వారికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

మేడ్చల్ నియోజకవర్గంలోని, మేడ్చల్ టౌన్ లో గల ఎండీవో కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు ఆయన చెక్కులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఉమ్మడి మేడ్చల్ మండలం, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు పాల్గొన్నారు.