ప్రతి వ్యక్తి యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి

ప్రతి వ్యక్తి యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి

గుండాల ,ముద్ర న్యూస్:-గుండాల మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల గ్రామపంచాయతీ మండల పరిషత్ ఈజీఎస్ ఆయా సంస్థల  వద్ద  ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని,యోగా గురించి వివరించి యోగాచేయించారు.ఈ సందర్భంగా,మండల వైద్యాధికారి డాక్టర్ ఇన్నిస్ డాక్టర్ హైమావతి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యోగా గురించి తెలుసుకొని యోగ చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో,డాక్టర్ ప్రసాద్ వైద్య సిబ్బంది ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.