బీజేపీ సహకారంతోనే తెలంగాణ ఆవిర్భావం 

బీజేపీ సహకారంతోనే తెలంగాణ ఆవిర్భావం 

కేంద్రంలో అనాడు బీజేపీ స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలను నిర్వహించారు.  ముందుగా బండి జాతీయ జెండాను ఎగరవేశారు.. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు.. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ, అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు.  రైతుల  అత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని అన్నారు. నలుగురి కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో మూర్ఖత్వ  పాలన కొనసాగుతుందని మండిప‌డ్డారు.

ప్రజలు అంతో ఇంతో సంతోషంగా ఉన్నారంటే అది కేంద్ర నిధులతోనేని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బండి సంజయ్ వెల్లడించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేత‌లు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.