జగిత్యాలకు వచ్చిన ఎన్నికల పోలీస్ పరిశీలకులు 

జగిత్యాలకు వచ్చిన ఎన్నికల పోలీస్ పరిశీలకులు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జగిత్యాల జిల్లా కు పోలీస్ పరశీలకులుగా వచ్చిన మేఘాలయ ఐపీఎస్ కేడర్ కు చెందిన  వివేకానంద్ సింగ్ కు పోలీసు గెస్ట్ హౌజ్ లో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ స్వాగతం పలికారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాటు, బార్డర్ చెక్ పోస్ట్ లలో వాహనాల తనిఖీలు, అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, విలువైన వస్తువులు, మద్యం మొదలగు వాటి స్వాధీనం, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి  ఎస్పీ వివరించారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు నేరుగా ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను మొబైల్ నెంబర్ 6302068249 కు ఫోన్ చేయవచ్చని జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వివేకానంద్ సింగ్ తెలిపారు. అనంతరం ఎస్పీ  ఎన్నికల సాధారణ పరిశీలకులు హెచ్. బసవ రాజేంద్ర , రాజీవ్ రంజన్ మీనా గార్లకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.