కవులు సమాజ నిర్దేశకులు జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్

కవులు సమాజ నిర్దేశకులు జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమాజములో జరుగుతున్న అకృత్యాలను తమ కలం ద్వార ప్రజలకు ఎలుగెత్తి చాటి చెప్పే సమాజ నిర్దేశకులు కవులు అని జగిత్యాల జిల్లా గ్రంధాలయం చైర్మన్ డాక్టర్ గొల్లపెల్లి చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. కళాశ్రీ సాహితీ వేదిక జగిత్యాల అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక భారత్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా శ్రీ  శోభ కృతు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు.

దాదాపు 50 మంది కవులు, కవయిత్రలు ఉగాది పర్వదిన కవితా గానం వినిపించారు. ప్రపంచ కవితా దినోత్సవ ప్రత్యేక కేకు కట్ చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ అనంతరం కవులను ఘనంగా ఉగాది పురస్కరాలతొ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ సంస్థ అధినేత గుండేటి రాజు, మద్దెల సరోజన, అయిత అనిత, నమిలికొండ సాకేత,శ్యామ్ సుందర్, మద్దెలప్రభాకర్, వోదెలగంగాధర్, లక్కారాజుశ్రీలక్ష్మి, కండ్ల పల్లిసరళ, సంకేటికవిత, ముత్తెపుభాగ్యలక్ష్మి, రుద్రంగికమల, గాజోజు రాధ, కీర్తిహేమలత,సంకోజి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.