ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు..

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు..
  • బెంగుళూరులో ఐటీ దాడులు

బెంగుళూరు: బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. 20 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. మట్టికెరె, బీఎల్ సర్కిల్, ఆర్ఎంవీఎక్స్ స్టేషన్, మల్లేశ్వరం సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో వందమందికిపైగా అధికారులు పాల్గొని ఏక కాలంలో దాడులు చేశారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు నుంచి నగదు సరఫరా అయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో ఐటీ అధికారులు గత వారం రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బంగారం వ్యాపారం చేసే యజమానుల ఇళ్లు, షాపుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బంగారం, నగదు భారీగా పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా ఈ దాడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది