వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌లోనే ఇద్దరు మృతి

వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌లోనే ఇద్దరు మృతి

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన గుర్రంగూడ చౌరస్తాలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మీర్‌పేట్‌కు చెందిన బొల్లం ప్రణయ్, వనస్థలిపురంకు చెందిన కుంచల రవిగా గుర్తించారు.ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాగా.. హయత్ నగర్ నుంచి మాదాపూర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రమాదంలో రెండు కార్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.