కేసీఆర్ను ఎదుర్కునే దమ్ము లేక కుట్రలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ప్రధాని మోడీ ని ఎదిరించే దమ్మున్న కేసీఆర్ను ఎదుర్కునే దమ్ము లేక కుట్రలుబీజేపీ చేస్తోందని, బీజేపీ లీక్ నేతల పార్టీగా మారిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ,మంత్రి స్మృతి ఇరానీ,సంజయ్, అరవింద్ అంతా ఫేక్ సర్టిఫికెట్ ల నేతలన్నారు. ప్రశాంత్ బండి సంజయ్ కు పేపర్ ఎందుకు పంపాలి...సంజయ్ ఏమైనా 10వ తరగతి చదువుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.