మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ముద్ర.వీపనగండ్ల:- ఇటీవల మామిడి తోటలో విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందిన యువకుడు చెనమోని రవి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకుడు ముంత శివ యాదవ్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.వీపనగండ్ల గ్రామానికి చెందిన చెనమోని రవి ఇటీవల మండల పరిధిలోని గోవర్ధనగిరి వద్ద మామిడి తోటలో విద్యుత్ ఘాతుకానికి గురై మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక కొడుకు మృతి చెందడంతో బారాస యువ నాయకుడు ముంత శివ యాదవ్ తల్లిదండ్రులను పరామర్శించి మనోధైర్యం కల్పించి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం మృతుని కుటుంబాని ఆదుకోవాలని ముంత శివయాదవ్ కోరారు. కార్యక్రమంలో యూత్ నాయకులు శివశంకర్, సాయి కృష్ణ, రాధాకృష్ణ, రాజేష్, శివకృష్ణ ఉన్నారు.