తరలిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

తరలిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

ముద్ర, వీపనగండ్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి మండల పరిధిలోని గ్రామాల నుంచి వేలాదిమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు మహిళలు తరలి వెళ్లారు. గత నాలుగు రోజులుగా మండలంలోని నాయకులు గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి ముఖ్యమంత్రి సభకు వచ్చి విజయవంతం చేయాలని చేయాలని నిర్వహించారు. జనాన్ని తరలించడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలను సమకూర్చి  కొల్లాపూర్ బహిరంగ సభకు తరలించారు.