నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు వస్తుంది - ఎమ్మెల్సీ  ఏ వి ఎన్ రెడ్డి

నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు వస్తుంది - ఎమ్మెల్సీ  ఏ వి ఎన్ రెడ్డి

ముద్ర. వనపర్తి:-నిబద్ధతతో, అంకితభావంతో పనిచేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుందని ఎం ఎల్ సి ఏ వి ఎన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం  తపస్ వనపర్తి జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైన ఎం శోభారాణి స్కూల్ అసిస్టెంట్ జెడ్ పి హెచ్ ఎస్ ఘనాపూర్ గారిని  శాలువతో సన్మానించి, మెమెంటు ను బహుకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు  వృత్తినిబద్దతతో ఉండాలని వృత్తిపట్ల ఫ్యాషన్ కలిగి ఉండాలని, ఏదో సాధించాలనే తపన, విద్యార్థులను గొప్పవారుగా చేయాలని ఆరాటం ఉన్నప్పుడు సమాజం గుర్తింపునిస్తుందని అన్నారు.సొంత ఖర్చులతో గణిత ల్యాబ్ ను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు శోభారాణి ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు.ఈ సమావేశంలో  తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, వనపర్తి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్,రాష్ట్ర బాధ్యులు కరుణాకర్ గౌడ్, వర ప్రసాద్ గౌడ్ వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.