18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలి: డాక్టర్ వంశీకృష్ణ
![18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలి: డాక్టర్ వంశీకృష్ణ](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d7babdeea23.jpg)
ముద్ర, వనపర్తి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్యలకు దూరంగా ఉంచాలని మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కార్యక్రమాన్ని శుక్రవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించి కంటి పరీక్షలను చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందుచూపుతో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని వారు కోరారు. కంటి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దూరం చేసుకోవాలని, అందుకే ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప, మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ భాగ్యశ్రీ, హెల్త్ అసిస్టెంట్లు రాములు, శ్రీనివాసులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు, ఆశాలు పాల్గొన్నారు.