ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
![ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645a656a1af86.jpg)
ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన నవీన అనే విద్యార్థిని మార్కులు తక్కువగా వచ్చాయని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విద్యార్థిని మహబూబ్ నగర్ లోని ప్రతిభా కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఆ విద్యార్థిని తండ్రి చిన్నతనంలో మృతి చెందగా తల్లి లక్ష్మి పోషిస్తుంది. వెంకటేష్ పద్మ దంపతులకు చెందిన నవ్య అనే విద్యార్థిని పట్టణంలోని నివేదిత కళాశాలలో చదువుతుండగా పే ఇంటర్ ఫెయిల్ కావడంతో ఆల్ అవుట్ మందు తాగి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.