పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించండి: ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
![పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించండి: ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d7b93367b11.jpg)
ముద్ర, నిర్మల్ ప్రతినిధి: విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులకు సంతృప్తి కలిగించాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే తప్ప భవిష్యత్తు ఉండదని బాగా చదివి మంచి పేరు తేవాలని ఆయన ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుభాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.