వన్య ప్రాణుల రక్షణ అందరి బాధ్యత

వన్య ప్రాణుల రక్షణ అందరి బాధ్యత
  • అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శర్వానంద్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:విశ్వంలో మనుషులతో పాటు అన్ని జీవరాసులు మనుగడ సాగిస్తేనే జీవవైవిధ్యం సాధ్యపడుతుందని బాసర అటవీ సర్కిల్ సి సి ఎఫ్ శర్వానంద్ అన్నారు. అటవీ జంతువులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 69వ అటవీ జంతువుల వారోత్సవాల్లో భాగంగా బాసర అటవీ సర్కిల్ ఉద్యోగులు కార్యాలయం ను చి వివేక్ చౌక్ వరకు మంగళ వారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్య ప్రాణుల ఆవశ్యకత  పట్ల విద్యార్థులకు, సమాజానికి అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రామ కిషన్, ఎఫ్ఆర్ఓ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.