అభివృద్ధి పనులకు నిధులివ్వండి

అభివృద్ధి పనులకు నిధులివ్వండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళ వారం కలిశారు. ఈ సందర్భంగా తలమడుగు మండలం కజ్జర్ల లో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపానికి రూ. 30 లక్షలు, బోథ్ మండలం తేజాపూర్ లో నూతనంగా నిర్మించ తలపెట్టిన రామాలయ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.