కేజీ నుంచి పీజీ విద్య అందించటమే ప్రభుత్వ ధ్యేయం - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

కేజీ నుంచి పీజీ విద్య అందించటమే ప్రభుత్వ ధ్యేయం - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర అటవీ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు స్థానిక దివ్య గార్డెన్ లో ఆదివారం రాత్రి జరిగిన మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థినుల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉందన్నారు. అవకాశాలు వినియోగించుకొని భవిష్యత్తును తీర్చిదిదుకోవాలని విద్యార్థినులకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.