ఊపిరాడక వ్యక్తి మృతి

ఊపిరాడక వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి ఊపిరాడక మృతి చెందాడు. వివరాలిలా వున్నాయి. భైంసా కు చెందిన అంకుష్ తన ఇంట్లో శనివారం రాత్రి క్యాండిల్ వెలిగించి ప్లాస్టిక్ కుర్చీ పై దాన్ని ఉంచి నిద్ర పోయాడు. ఆ తర్వాత క్యాండిల్ కాలుతూ కుర్చీకి నిప్పంటుకుంది. ఫలితంగా గది నిండా పొగ నిండిపోవడంతో ఊపిరాడక ఆయన మృతి చెందాడు.