మంజులా పూర్ లో ఘర్షణ

మంజులా పూర్ లో ఘర్షణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ రూరల్ మండలం మంజులా పూర్ లో బిజెపి కార్యకర్తలకు, బీ ఆర్ ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ కండువా తో పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న బిజెపి కార్యకర్తలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా బీ ఆర్ ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే ఇంద్రకరణ్ వెనుదిరగడంతో పరిస్థితి సద్దు మణిగింది.