స్వేచ్ఛగా  ఓటు హక్కును వినియోగించుకోవాలి

స్వేచ్ఛగా  ఓటు హక్కును వినియోగించుకోవాలి

ముద్ర.వీపనగండ్ల: ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకే, శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్సై రవి ప్రకాష్ తెలిపారు.తూముకుంట లో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించరు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మరియు ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరికీ  పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ప్రజల్లో ధైర్యాన్ని కల్పించడానికి  ప్లగ్ మార్చ్ నిర్వహించడం  జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని పోలింగ్ కేంద్రాల నందు సాయుద బలగాలతో కలిసి  పోలీసు సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై చంద్రారెడ్డి కేంద్ర సాయుధ బలగాలు పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.