హైదరాబాద్‌ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం..

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్‌ లోని OYO హోటల్‌ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ లోని చైతన్యపురి మోహన్ నగర్ లోని ఓయో హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది.

ఈ నేపధ్యంలో మంటల్లో 8 మంది చిక్కుకున్నారు. అయితే.. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది…మంటల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడారు. పొగకు ఊపిరి ఆడక ఇద్దరికీ అస్వస్థత నెలకొంది. దీంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఫైర్ సిబ్బంది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.