విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి అల్లోల

విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ లోని దత్తాత్రేయ నగర్ లో శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయ పాద వల్లభ శ్రీ నృసి0హ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఆలయ పునర్నిర్మాణం కొరకు రూ.65 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. వీరితోపాటు  పారిశ్రామికవేత్త మురళీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్,ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, జీవన్ రెడ్డి జెడ్పిటిసి, నాలం శ్రీనివాస్,కౌన్సిలర్ శ్రీధర్, తదితరులు ఉన్నారు.