చరిత్ర సృష్టించనున్న కేసీఆర్ 

చరిత్ర సృష్టించనున్న కేసీఆర్ 
  • మూడోసారి ముఖ్యమంత్రి ఖాయం
  • పల్లా విజయం నల్లేరు మీద నడక 
  • మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ :మూడో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించనున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో పొన్నాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే.. ఇంత రాజకీయా అనుభవం గల తాను మార్పుకోరుకున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలని, బీసీలకు అన్యాయం జరుగుతుందని భావించి తాను తీసుకున్న నిర్ణయాన్ని జనగామ ప్రజలు స్వీకరిస్తారని పొన్నాల ఆకాంక్షించారు. ప్రజల మద్దతు కూడగట్టుకొని బీసీల రాజ్యాధికారం కోసం పొన్నాల ఉంటాడన్నారు.

దొంగ సర్వేలు, పైసలు వెచ్చించి చేయించారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల అభివృద్ధి, మార్పు కోసం గౌరవం కోసం మాత్రమే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. కేసీఆర్, పార్టీ సింద్ధాంతలు నమ్మి బీఆర్ ఎస్ కు వచ్చినా... ప్రభుత్వం సొమ్ము ప్రజల చెంతకు చేరడమే అనేది తన పాలనా ఎంతో గొప్పదనడనికి ఒక నిదర్శనం అన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అన్నారు. మెరుగైన వసతులు ప్రజలకు కల్పించే విధంగాల ముందుండే వాడు మీ పొన్నాల లక్ష్మయ్య అని గుర్తుంచుకోవాలన్నారు. పల్లా విజయాన్ని ఎవరు ఆపలేరని, విజయం నల్లేరు మీద నడకే అన్నారు. భారీ మెజార్టీ తో జనగామలో బీఆర్ ఎస్ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు బండ యాదగిరి రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, ఖాజా ఆరిఫ్ ఉద్దీన్, జంగిటి అంజయ్య, గురువయ్య గౌడ్, ఎండీ మాజీద్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఎండీ షకీల్, ఎండీ సలీం, కూరపాటి మధు, సౌడ మహేష్ , జీజీ రెడ్డి, జహంగీర్ , ఫయాజ్, పిట్టల రాజేష్, అజామ్, కొండా కిరణ్ పాల్గొన్నారు.