కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప చేయడం బిజెపి పిరికిపంద చర్య 

కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప చేయడం బిజెపి పిరికిపంద చర్య 

యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్
మోత్కూర్,ముద్ర:బిజెపి పార్టీ తమ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం పిరికిపంద చర్యని, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మందుల సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల  సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి న్యాయి యాత్ర ద్వారా వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోలేరని రానున్నది కాంగ్రెస్ పార్టీ అని కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని, కార్పొరేటర్లకు తొత్తులుగా వ్యవహరిస్తూ రౌడీ రాజ్యం పేరుతో మాత్రమే బిజెపి పాలన కొనసాగిస్తుందని ప్రతి ఒక్క నిరుద్యోగికి ,రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు అర్థమైందని ఆ భయంతోటి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను అడ్డుకున్నారని అన్నారు