డిఇఓకి పరిశోధన పుస్తకం అందజేత

డిఇఓకి పరిశోధన పుస్తకం అందజేత

ముద్ర ప్రతినిధి,జగిత్యాల: ధర్మపురి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేస్తున్న డా. గొల్లపెల్లి గణేశ్, ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ఆచార్య సాగి కమలాకర శర్మ  మార్గర్శకత్వంలో పరిశోధన చేసి రచించిన అంతర్జాలంలో తెలుగు భాష సాహిత్యాలు  అనే పుస్తకాన్ని జిల్లా విద్యాధికారి డా. బి. జగన్మోహన్ రెడ్డికి అందించారు. డిగ్రీ, పిజి స్థాయిలో తెలుగు విద్యార్ధులకు ఉపయోగపడే ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు డా. గణేశ్ ను విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పీ అర్ టీ యు టి ఎస్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని పేల్లి ఆనందరావు  పాల్గొన్నారు