బామ్మ ఆలోచన అదిరింది...కోతులు బెదిరాయి..

బామ్మ ఆలోచన అదిరింది...కోతులు బెదిరాయి..
  • దినుసులు అరబెట్టేదుకు సింహం బొమ్మ కాపలా
  • వినూత్నంగా కోతులను తరిమిన గౌరమ్మ

మెట్‌పల్లి ముద్ర:- పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా కోతులు కిష్కింధ కాండ సృష్టిస్తున్నాయి. వాటి బారినుండి కాపాడుకోవడానికి జనాలు నానా తంటాలు పడుతున్నారు. కానీ ఓ బామ్మ కోతులను తరిమెందుకు వినూత్నంగా ఆలోచించింది.ఇప్పుడు ఆ బామ్మ ఆలోచనకు చుట్టుపక్కల వాళ్లు ఫిదా అవుతున్నారు .. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకూర్తి గ్రామానికి చెందిన అంకతి గౌరమ్మ ఇంటి ముందు చిరుధాన్యాలు ఆరబెట్టింది కానీ కోతులు వాటిని తినడంతో పాటు చిందరవందర చేస్తున్నాయి. వాటి బారి నుండి ధాన్యాన్ని కాపాడుకొనేందుకు ధాన్యం ఆరబోసిన మంచం పై సింహం బొమ్మ ను పెట్టింది దీంతో కోతులు ఆ బొమ్మను చూసి పరుగుపెట్టాయి దీంతో గౌరమ్మ కోతుల బెడద తప్పి ఊపిరి పీల్చుకుంది..గౌరమ్మ ఆలోచనకు చుట్టుపక్కల వాళ్లు ఫిదా అయిపోయి పొగడ్తలతో ముంచెత్తారు..కోతుల బెడద తట్టుకునేందకు ఇలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.