రెయిలింగ్ కు ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి

రెయిలింగ్ కు ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్ కు ఢీకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రం కూల్చారం సమీపంలో లోతు వాగు వద్ద చోటుచేసుకుంది. కొల్చారం మండల కేంద్రంకు చెందిన ఆరిఫ్ (55) అక్కడికక్కడే మృతి చెందగా మాజీ వార్డు సభ్యుడు మహమ్మద్ (48) అసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

ఇరువురు కౌడిపల్లి నుంచి కుల్చారం వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు సైడ్ రెయిలింగ్ కు ఢీకొన్నారు. సంఘటన విషయంలో తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.