తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ
ముద్ర,హైదరాబాద్ :- తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి గూగుల్ ఉపాధ్యక్షుడు సంసిద్ధత వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. గురువారం సిఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ సిఎంకు వివరించారు.
గూగుల్ మ్యాప్స్,గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫారమ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుదలలపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్బాబు, కోమటిరెడ్డి తsaదితరులు పాల్గొన్నారు.