జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి.
![జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి.](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64db5316c0276.jpg)
- మహనీయుల త్యాగం మరువలేనిది.
- స్వతంత్ర ఫలాలు అందరికి అందాలి.
- జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జిల్లా అభివృద్దే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. 77 స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి లతో కలసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా పోలీస్ వందనం స్వీకరించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికి అందించటడం, అభివృద్దే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో మహనీయుల చరిత్ర , వారి సేవలు ఎప్పటికి మారువరాదని యువతకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు ఈ సందర్బంగా అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సి.ఈ. ఓ సురేష్, పీడీ కిరణ్ కుమార్, సి.పి.ఓ జి. వెంకటేశ్వర్లు, డి.ఏ.ఓ రామారావు నాయక్, డి.హెచ్.ఓ శ్రీధర్ గౌడ్, పి.డి. ఐసీడీఎస్ జ్యోతి పద్మ, బి.సి.వెల్ఫేర్ అధికారి అనసూర్య, dtwo శంకర్, డిపిఆర్ఓ హబీబ్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.