కరీంనగర్లో భారీ పేలుడు !

ముద్ర,కరీంనగర్:-ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగగా కొంతమంది అక్కడికి చేరుకుని చూస్తుండగా మంటలకు ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదాన్ని చూసేందుకు ఆ ఇంటికి సమీపంలో జనం గుమిగూడారు.

ఈ క్రమంలో మంటల వల్ల ఆ ఇంట్లో ఉన్న సిలిండర్ ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దంతో పాటు మంటలు పైకి లేచాయి. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు.కాగా.. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.