బండి సంజయ్ కంటే నేనే పెద్ద హిందువును
![బండి సంజయ్ కంటే నేనే పెద్ద హిందువును](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_6558e4197816b.jpg)
బీజేపీ దేవుణ్ణి రాజకీయాలకోసం వాడుకుంటుంది
కరీంనగర్ గడ్డ పై ఎగిరేది గులాబీ జెండా
కాంగ్రెస్ 6 గ్యారెంటీలు నమ్మి మోసపోవద్దు
ఎన్నికల ప్రచారం లో గంగుల కమలాకర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బండి సంజయ్ కంటే పెద్ద హిందువును నేనే - బీజేపీ వాళ్ళు దేవుణ్ణి రాజకీయాలకోసం వాడుకుంటారని నేను మాత్రం దేవుణ్ణి గుండెలో పెట్టి కొలుస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో ఓటుకి 20 వేలు ఇచ్చేందుకు బీజేపీ వాళ్ళు సిద్ధమయ్యారని ఆరోపించారు. వాళ్ళు ఇచ్చే 20 వేలు తీసుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శని వారం ఆయన 44,45,26డివిజన్ పరిధిలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి గంగుల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం కెసిఆర్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని గులాబీ జెండానే నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాయమాటలకు మోసపోవద్దని ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మిమోసపోవద్దని కోరారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
కరీంనగర్ లో ఇప్పటి వరకు నిర్వహించిన అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే జరిగిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, మద్దతు ధర, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం పండుగలా మారిందన్నారు. నాడు కరెంట్ కోసం రోడ్లెక్కితే ప్రస్తుతం 24గంటల కరెంట్తో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఎలాంటి గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పారీ మాటలు నమ్మి మోసపోద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీరంతా ఎక్కడికి పోయారన్నారు.. ఈ కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు మెండి శ్రీలత - చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.