ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో  ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి

 ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో  ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి

లక్నో : అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో మత సామరస్యం వెల్లివిరిసింది. సోమవారం జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్.. డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సాధువుతో కలిసి ఆయన మాట్లాడారు. ‘ఇది నవ భారతదేశం ముఖచిత్రం.. మన అతిపెద్ద మతం మానవత్వం. మనకు దేశమే ఫస్ట్’ అని ఇల్యాసీ పేర్కొన్నారు. కాగా ఈ వీడియోను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ‘నేడు గర్వంగా ఉంది’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.