నేతాజీ నగర్ కాలనీలో అయోధ్య అక్షింతల వితరణ

నేతాజీ నగర్ కాలనీలో అయోధ్య అక్షింతల వితరణ

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను నగరంలోని పలు కాలనీలు,  బస్తీలలో వలంటీర్లు బుధవారం నాడు ఇంటింటికీ తిరిగి  ప్రజలకు అందజేశారు. అక్షింతల వితరణ కార్యక్రమం మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో వైభవంగా జరిగింది.  కాలనీలోని శ్రీ ఉమామహేశ్వర, సీతారామ,  అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  మహిళా వలంటీర్లు సైతం చురుగ్గా పాల్గొన్నారు. ఆలయ కమిటీ కన్వీనర్ టీఎస్ ఆనంద్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జి అప్పారావు, శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, శ్రీదేవి, లక్ష్మీ కుట్టి, ఆలయ అర్చకులు కేశవమూర్తి, రాజేష్ పాండే, తదితరులు పాల్గొన్నారు.