బిజెపిని వీడిన ఐటీ సెల్ ఇంచార్జ్

బిజెపిని వీడిన ఐటీ సెల్ ఇంచార్జ్
  • ఎమ్మెల్యే కల్వకుంట్ల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక...

మెట్‌పల్లి ముద్ర:- బీజేపి పార్టీ ఐటి సెల్ ఇబ్రహీంపట్నం మండల ఇంచార్జ్. జిల్లా కోర్ కమిటీ సభ్యుడు. మారంపెల్లి నాగరాజ్ బీజేపి పార్టీ కి రాజీనామా చేసి డాక్టర్ రణవేణి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాగరాజ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ అరవింద్ ప్రవర్తన నచ్చకపోవడంతో బీజేపి పార్టీనీ విడుతున్నట్లు తెలిపారు. ఎంపీ అరవింద్ పార్టీని నమ్ముకుని పని చేసే వారిని విస్మరిస్తున్నాడని. బీ ఆర్ ఎస్ పార్టీ లో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందన్నారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపాడు.