పేద విద్యార్థులకు "కడియం ఫౌండేషన్" చేయూత

పేద విద్యార్థులకు "కడియం ఫౌండేషన్" చేయూత

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని పలువురు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, యం.ఎల్.సి కడియం శ్రీహరి ఆర్థిక సహాయాన్ని అందించారు. జఫర్గడ్ మండలం కూనూరుకి చెందిన ఇల్లందుల భీమయ్య కొడుకు వంశి యం.బి.బి.ఎస్ చదువు కోసం, స్టేషన్ ఘన్ పూర్ కి చెందిన నీరటి ప్రభాకర్ కూతురు నీరటి సాయిశ్రీ బి.ఎస్.సి నర్సింగ్ చదువుకు, చిల్పూర్ మండలం రాజవరంకి చెందిన భాగ్యలక్ష్మి మనుమరాలు రాసమల్ల కృష్ణవేణి డిప్లొమా చదువుకు, ధర్మసాగర్ మండలం క్యాతంపల్లికి చెందిన గంగారపు సంజీవ కూతురు సురక్షిత యం.బి.బి.ఎస్ చదువుకు కడియం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో కడియం కావ్య, కడియం దివ్య, చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బుర్ల శంకర్, తాళ్లపల్లి సంపత్, మారపల్లి శ్యాం కుమార్ రెడ్డి, ఉద్దెమారి రాజ్ కుమార్, ఎర్రబెల్లి చేరాలు, నీల గట్టయ్య, నీరటి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.