తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన కీర్తి రెడ్డి

తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన కీర్తి రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్టిక్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను కుంభం కీర్తి రెడ్డి భువనగిరి  ఇండోర్ స్టేడియంలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టైక్వాండో క్రీడలు మన జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. జిల్లాలో అందరూ నేర్చుకోవాలని టైక్వాండో ఆత్మ రక్షణ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  తన వంతు సహాయ సహకారాలు అందిస్తాన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 31 జిల్లాల నుంచి 230 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొంటున్నారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.శ్రీనివాస్, తెలంగాణ స్టేట్ టైక్వాండ అసోసియేషన్ సెక్రటరీ కే.శ్రీహరి, ఆర్గనైజర్లు కే.శ్రీకాంత్, కే. సైదులు, వి.రవికుమార్, పి వెంకటేష్, వినయ్, అనిల్ రమేష్, అంబేద్కర్, విశాల్ కుమార్ పాల్గొన్నారు.