భారతీయ జనతా పార్ట యువమోర్చ అధ్యక్షుడిగా కొత్తకొండ వినీత్ గౌడ్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:జగిత్యాల పట్టణ భారతీయ జనతా పార్ట యువమోర్చ అధ్యక్షుడిగా కొత్తకొండ వినీత్ గౌడ్ నియమితులయ్యారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణి జగిత్యాల కమలా నిలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్ సమక్షంలో వినీత్ కు నియామక పత్రం అందజేశారు. భారతీయ జనతాపార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని, పార్టీ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని భోగ శ్రావణి నూతన అధ్యక్షుడిని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు గదాసు రాజేందర్, కార్యదర్శి ఆముద రాజు, గట్టపెల్లి గ్యానేశ్వర్, ధీరజ్ గౌడ్, సాయిరాం మొదలగువారు పాల్గొన్నారు.