వైభవంగా సీతారాముల కళ్యాణం
![వైభవంగా సీతారాముల కళ్యాణం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6425b69abdd94.jpg)
డి ఎం పి : పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
ముద్ర, వెల్గటూరు: వెల్గటూరు మండలంలో శ్రీరామ నవమిని పురస్కరించు కుని గురువారం సీతారాముల కళ్యాణాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఉండేడ గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కల్యాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాలల్లో కోదండ రామాలయాలు, హనుమాన్ దేవాలయాలను అలంక రించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధారాణి , ఎంపీపీ కూనమల్ల లక్ష్మి ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, పిఎసిఎస్ చైర్మన్ లు రామ్ రెడ్డి రత్నాకర్, జూపాక కుమార్ ఆలయ చైర్మన్ మేరుగు నరేష్ కోన రాకేష్ సర్పంచులు గెళ్ళు శేఖర్ యాదవ్ మేరుగు మురళి బోడ కుంటి రమేష్ గాగి రెడ్డి లింగమ్మ రాజేశ్వర్ రెడ్డి,శైలేందర్ రెడ్డి, సింహాచలం జగన్ కొంగుల జగదీశ్వర్ రెడ్డి కొమ్ము రాంబాబు, జలంధర్ రెడ్డి తిరుపతి, సాగర్ లావణ్య సనీల్ బోడుక గంగయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు.