సకాలంలో రుణాలు చెల్లించాలి

సకాలంలో రుణాలు చెల్లించాలి

ముద్ర/వీపనగండ్ల:-రైతులు వ్యాపారస్తులు మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వీపనగండ్ల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ రవీందర్ బాబు అన్నారు. మంగళవారం రవీందర్ బబు తన ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడుతూ రైతులు పంట పెట్టుబడి కోసం తీసుకున్న రుణాలను గడువులోగా రెన్యువల్ చేయించుకోవడం వల్ల రైతుకు మేలు జరుగుతుందని అన్నారు. వీపనగండ్ల ఐఓబి బ్యాంకులో 2800 మంది రైతులకు రుణమాఫీ రాగా, అందులో 578 మంది రైతులకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెండింగ్ లో ఉంచడం జరిగిందని, 1300 మంది రైతులు తీసుకున్న క్రాప్ లోన్స్ రెన్యువల్ చేయించుకోలేదని అన్నారు. అంతేకాక ఏడు కోట్ల 61 లక్షల రూపాయల పైప్లైన్ రుణాలు రైతులు ఇప్పటివరకు చెల్లించలేదని, వ్యాపారాల కోసం ముద్ర లోన్ ద్వారా తీసుకున్న కోటి 43 లక్షల రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు.తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించటం వల్ల బ్యాంకు కూడా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికైనా రుణాలను చెల్లించి బ్యాంకుకు సహకరించాలని మేనేజర్ రవీందర్ బాబు కోరారు.