ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తా - ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
- అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మర్కజి కమిటీ వినతి
మెట్పల్లి ముద్ర:- ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని శనివారం మెట్పల్లి మర్కజి ఇంతజామీ కమిటీ మిల్లత్ -ఏ- ఇస్లామియా అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దిన్ పాష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కు వినతి పత్రం అందజేశారు.
పట్టణంలో ఉర్దూ మీడియం పాఠశాల, షాదిఖానా, వెల్లుల్ల రోడ్ లోని ఖబ్రస్థన్, వెంకట్రావుపేట్ లోని ఈద్గా, పట్టణంలోని మసీదులలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, ముస్లిం మైనార్టీల ఆర్థిక అభివృద్ధి కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేకు అందజేసిన వినతి పత్రంలో కమిటీ సభ్యులు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని, ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతామని, ముస్లింల ఆర్థిక అభివృద్ధి కోసం సబ్సిడీ రుణాలు అందజేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్కజి ఇంతజామీ కమిటీ మిల్లత్ -ఏ- ఇస్లామియా షేక్ సాదక్, సాజిద్, జావిద్ నయుం, అజార్, అప్రోజ్ రహూప్ అలీమ్, యూసుఫ్, తోఫిక్, వాజిద్, మసూద్ అలీ, లాలా,మజీద్, తదితరులు పాల్గొన్నారు.