బిజేపి తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ ఎల్. రమణ సోదరుడు ఎల్. శేకర్

బిజేపి తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ ఎల్. రమణ సోదరుడు ఎల్. శేకర్

ఎంపి అరవింద్ సమక్షంలో జగిత్యాలలో పలువురి చేరిక 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలువురు వివిధ పార్టీల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో  బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ భోగ శ్రావణి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు బిజెపి చేరారు. జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సి ఎల్ రమణ సోదరుడు, టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎలగందుల చంద్రశేఖర్ తో పాటు పట్టణానికి చెందిన ఉప్పరిపేట్ యాదవ సంఘం మాజీ అధ్యక్షుడు ఎక్కలదేవి మల్లేశం, అరవింద్ నగర్ రామ్ యువసేన యూత్ సభ్యులు నవీన్, ప్రదీప్, మల్లికార్జున్, నిఖిల్, మనోజ్, ప్రవీణ్, ప్రశాంత్, మని, వర్షిత్, బన్నీ, రాజు, వడ్లూరి హరీష్, స్తంభం రాజు తో పాటు పలువురు పార్టీలో చేరారు. 

పార్టీలో నూతనంగా జాయిన్ అయిన వారికి ఎంపీ అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు జిల్లాలో విస్తృతంగా కృషి చేయాలని సూచించారు. ఇందూర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో రానున్న రోజులలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువల తిరుపతి, రైతు నాయకులు పన్నాల తిరుపతి,  పడాల తిరుపతి, రాగిళ్ల సత్యనారాయణ, ఆముదరాజు, జగదీష్, పవన్ సింగ్, రవితేజ, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.