మల్యాలవాసికి ఉగాది మహానంది పురస్కార్..

మల్యాలవాసికి ఉగాది మహానంది పురస్కార్..

ముద్ర, మల్యాల: మల్యాల మండల కేంద్రానికి చెందిన బోడ గోవర్ధన్ సామజిక సేవా రంగంలో ఉగాది మహానంది జాతీయ పురస్కార్ అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లో తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు 2023- పురస్కార్తో పాటు, ప్రశంస పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బహ్మ్మశ్రీ పో్లోజ్ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి పూర్ణచంద్ర చార్యులు, మల్యాల నుంచి బీఆర్ఎస్ నాయకులు బట్టు విజయ్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్బంగా గోవర్ధన్ ను మల్యాలకు చెందిన పలువురు నాయకులు అభినందించారు.