కన్నులపండువగా వేంకటేశ్వరస్వామి శోభయాత్ర
పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వేంకటేశ్వర స్వామి శోభయాత్రను మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి, వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో నూతనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు.
అందులో ఈ నెల 5 నుండి 8వరకు ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో శోభాయాత్ర నిర్వహించారు. వేదమంత్రాలు, మహిళల కోలాటాల మధ్య శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి, పట్టణంలోని భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.