నేడు మెదక్ కు తొలిసారిగా ఎమ్మెల్యే రోహిత్ రాక

నేడు మెదక్ కు తొలిసారిగా ఎమ్మెల్యే రోహిత్ రాక
  • క్యాంపు కార్యాలయంలో గో పూజతో ప్రవేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:ఎమ్మెల్యేగా గెలుపొందిన డా.మైనంపల్లి రోహిత్ మొదటి సారిగా ఈనెల 8న రానున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపు ధ్రువీకరణ పత్రం సైతం అయన అత్త మామలు తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం మంచి రోజు ఉండడంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రవేశం చేయనున్నారు. ఈ సందర్బంగా గోపూజ, ప్రవేశముగణపతి పూజ, శ్రీ లలితా త్రిపుర సుందరీ మాతకు పంచామృతాభిషేకము, కుంకుమార్చన, పుష్పార్చనలుహోమం నిర్వహిస్తారు. అనంతరం ముస్లీం, క్రిస్టీయన్ ల మత పెద్దల ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత  కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్  క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దంపతులంటారు.

క్యాంపు కార్యాలయం సిద్ధం

ఈనెల 4 నుండి క్యాంపు కార్యాలయంలో వాస్తు మార్పులు, చేర్పులు, రంగులు, ఫర్నిచర్ ఏర్పాటు తదితర పనులు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు, అడ్వకేట్ జీవన్ రావు, బొజ్జ పవన్ లు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటి సారిగా మైనంపల్లి రోహిత్ వస్తున్నందున పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని క్యాంపు కార్యాలయం బయట శామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.