కవిత అరెస్టు రాజకీయ కుట్ర

కవిత అరెస్టు రాజకీయ కుట్ర
  • ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కవిత అరెస్టుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో లబ్ది పొందాలని ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఎలా అరెస్టు చేస్తారని ,ఇది కేవలం బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్ని అక్రమ అరెస్టులు ,రాజకీయ కుట్రలు చేసినా తాము భయపడేది లేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు సామల మల్లారెడ్డి, దేవరాయ కుమార్, కుడికాల అఖిల బలరాం, నాయకులు సామ రవీందర్ రెడ్డి, నోముల మాధవరెడ్డి, గునిగంటి మల్లేష్ గౌడ్,చేరాల నరసింహ, చిలువేరు బాలనరసింహ, చింతకింది కిరణ్, నోముల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.